Friday, April 15, 2022

Daily Current Affairs - One Liners (15-04-2022)

 Daily Current Affairs - One Liners (15-04-2022)


1, తమిళనాడు ప్రభుత్వం డాక్టర్ BR అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14 ను ఈ సంవత్సరం నుండి "సమానతా దినోత్సవం"గా జరుపుకొనుంది.


2, 20వ భారత్-ఫ్రాన్స్ జాయింట్ స్టాఫ్ చర్చలు పారిస్‌లో జరిగాయి. ఈ చర్చల ద్వారా రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించినది.


3, పత్తి ధరలను తగ్గించేందుకు, పత్తి దిగుమతులపై అన్ని కస్టమ్స్ సుంకాలను మినహాయించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.


4, కోటక్ మహీంద్రా బ్యాంక్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ అయిన Kotak FYN ను ప్రారంభించింది. ఇది వ్యాపార బ్యాంకింగ్ మరియు కార్పొరేట్ క్లయింట్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫారమ్.


5, ఇటీవల, సుప్రీంకోర్టు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) ని ఫిల్మ్ మేకింగ్ మరియు ఎడిటింగ్‌కు సంబంధించిన కోర్సుల నుండి వర్ణాంధత్వంతో బాధపడుతున్న అభ్యర్థులను మినహాయించవద్దని ఆదేశించింది. దానికి బదులుగా దాని పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని కోరింది.


6, గార్మెంట్ మరియు టెక్స్‌టైల్ రంగానికి రూ. 10,683 కోట్ల ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహకం (PLI) పథకం కింద, భారత కేంద్ర ప్రభుత్వం 61 కంపెనీల ఆర్థిక సహాయానికి ఆమోదం తెలిపింది.


7, మాజీ సైనికులు మరియు యువకుల కోసం ఉద్దేశించిన "హిమ్ ప్రహరీ" పథకాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకం ఉత్తరాఖండ్ నుండి ప్రజల వలసలను అరికట్టడానికి ఉద్దేశించబడింది.


8, 2022-23 ఆర్థిక సంవత్సరానికి, భారతదేశ జిడిపి అంచనాను ప్రపంచ బ్యాంకు 8.7 శాతం నుండి 8 శాతానికి తగ్గించింది







No comments:

Post a Comment